శ్రీబాగ్ ఒడంబడిక అమలు | SRI BAGH PACT FOR IMPLEMENTATION
శ్రీబాగ్ ఒడంబడిక శ్రీబాగ్ ఒడంబడిక అమలులో పాలకుల వైఫల్యాలకు నిరసనగా నవంబర్ 16 2021 న నిర్వహిస్తున్న రాయలసీమ సత్యాగ్రహం విజయవంతం చేయండి. వేదిక :- గాంధీ చౌక్, నంద్యాల మరియు రాయలసీమలోని వివిధ రెవిన్యూ కేంద్రాలలో తేది,సమయం :- నవంబర్ 16, 2021 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు నవంబర్ 16 నే రాయలసీమ సత్యగ్రహం ఎందుకు ? రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937 జరిగింది. కానీ హక్కుల పత్రంలోని ఏ అంశాలను కూడా పాలకులు అమలు పరచలేదు.అందుకే రాయలసీమ హక్కుల పత్రంలోని అంశాలను అమలు చేయమని శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16న గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ ప్రజా సంఘాలు సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి . శ్రీ బాగ్ ఒడంబడిక ఎందుకు జరిగింది ? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మొదలయ్యింది. ఈ ఉద్యమంలో తొలి విజయంగా తెలుగు ప్రాంతంలో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం అనుమతించింది. రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణం లో ఏర్పాటు చేయడంతో రాయలసీమ ప్రజలకు కోస్తా నాయకత్వంపై నమ్మకం తగ్గింది. దీ