Rayalaseema Satyagraham | రాయలసీమ సత్యాగ్రహం

 

రాయలసీమ సత్యాగ్రహం

నవంబర్ 16, 2021

-------------------------------

రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై 2008 నుండి ప్రతి సంవత్సరం  రాయలసీమ‌ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం నిర్వహించాల్సిన సత్యాగ్రహం పై ప్రజా సంఘాల సలహాలను, సూచనలను ఆహ్వానిస్తు జులై 25, 2021 న రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఉత్తరం వ్రాయడమైనది. 


రాయలసీమ సత్యాగ్రహం -2021  రాయలసీమలోని జిల్లా కేంద్రాలు మరియు ప్రధాన రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని సూచనలు ప్రధానంగా వచ్చాయి. రాయలసీమ సత్యాగ్రహం ఉదయం 10 గంటలనుండి సాయింత్రం 4 గంటల వరకు నిర్వహించాలని సూచనలు వచ్చాయి. అదే సందర్భంలో ఏదైనా ఒక రాయలసీమ కేంద్రంలో కేంద్రీకృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచనలు కూడా వచ్చాయి.


కోవిడ్ -19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున కేంద్రీకృతంగా కాకుండా రాయలసీమ జిల్లాల్లో వివిధ కేంద్రాలలో  రాయలసీమ ప్రాజెక్టుల ప్రాధాన్యత, శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాజధాని/హైకోర్టు, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంగా రాయలసీమ సత్యాగ్రహం - 2021 నిర్వహించాలని నిర్ణయించడమైనది.  శ్రీబాగ్ ఒడంబడిక అమలుతో  రాయలసీమ అభివృద్ధికి తోడ్పడే లాగా అన్ని రాజకీయ పార్టీల సహకరించేలాగా  కార్యాచరణను రాయలసీమ సత్యాగ్రహం - 2021 ద్వారా చేపట్టాలని నిర్ణయించడమైనది.


రాయలసీమ ప్రజా సంఘాలు తమ తమ ప్రాంతాల్లో రాయలసీమ సత్యాగ్రహం -16 నవంబర్ 2021 న వివిధ ప్రజాసంఘాల సమన్వయంతో నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి. 

----------------------------

 బొజ్జా దశరథ రామి రెడ్డి

*కన్వీనర్* 

రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక

98480 40991

Comments